epaper
Monday, March 2, 2026
epaper

ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు..

కలం, వెబ్‌ డెస్క్: ఓ వైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ క్రమంగా పతనం అవుతోంది. తాజాగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో భారీ లొంగుబాటు చోటు‌చేసుకున్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 12 మంది మావోయిస్టులు (Maoist Surrender)  లొంగిపోయారు. వీరిలో కేంద్రకమిటీ సభ్యుడు రాంధేర్ (Ramdher Mazji) కూడా ఉన్నారు.  రాంధెర్ ప్రస్తుతం ఎంఎంసీ (Malkangiri–Mahasamund–Chhattisgarh region) ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్నారు.
దీంతో ఆ ప్రాంతంలో నక్సల్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయినట్టేనని తెలుస్తోంది. మావోయిస్టు కీలక‌నేత  మిలింద్ తెల్టుంబే మరణించాక ఎంఎంసీ బాధ్యతలను రాంధెర్ చూసుకుంటున్నారు. మొత్తం 12 మంది తమ ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిలో రాందెర్ మజ్జీ, చందూ ఉసెండీ,  లలితా, జానకి, ప్రేమ, రామ్‌సింగ్ దాదా, సుకేశ్ పొట్టమ్, లక్ష్మీ, శీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు.
Follow Us on: Youtube
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!