కలం / ఆలేరు : యాదగిరిగుట్ట ఆలయంలో (Yadagirigutta Temple) వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి సింహ వాహనసేవపై భక్తులకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిచ్చారు. ఆలయ మాడ విధుల్లో సింహవాహన సేవపై తీరు విధుల్లో ఊరేగింపు నిర్వహించారు అధికారులు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు దంపతులు,అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆలయ ఈవో భవాని శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.


