కలం, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు ఈ వేడుకలు కనులపండువగా కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.
ప్రధాన ఘట్టమైన తిరు కల్యాణ మహోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన అత్యంత వైభవంగా జరిపించేందుకు అర్చకులు ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు 26వ తేదీన దివ్య విమాన రథోత్సవం భక్తుల మధ్య కోలాహలంగా సాగనుంది. చివరగా 28వ తేదీన సహస్ర ఘటాభిషేకంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.


