కలం, కరీంనగర్ బ్యూరో: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన క్రేన్ యువతిపైకి దూసుకెళ్లిన ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఓ యువతి ప్రమాదానికి గురైంది. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన క్రేన్ ఆమెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం కుక్కల గూడూరుకు చెందిన యువతి బ్యూటీషియన్ కోర్స్ కోసం తరచూ కరీంనగర్కు అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఈ క్రమంలో కరీంనగర్ లో బస్సు దిగిన యువతిపై జెసీపీ క్రేన్ దూసుకెళ్లి ఎడమ కాలు పూర్తిగా విరిగింది. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలిని వెంటనే తన పోలీస్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు.

