కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండో విడత ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో నేడు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ కీలక దశలో మొత్తం 1,448 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటర్లు తమ తీర్పును వెలువరించేందుకు వీలుగా అధికారులు 41 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ కోసం మొత్తం 41,001 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గతంలో హింసకు తావున్న సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించింది. సుమారు 2,321 కంపెనీల కేంద్ర బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించారు. ఈ పోలింగ్ ఫలితాలు మే 4వ తేదీన విడుదలవుతాయి.

