కలం, వెబ్డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు మెంబర్లు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు మహాద్వారం వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాధాకృష్ణన్కు వేద ఆశీర్వచనాలు అందించగా.. బీఆర్ నాయుడు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

