కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మోటకొండూరు నుంచి పులిగిల్ల గ్రామానికి, మూసీ నుంచి సంగెం గ్రామానికి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా రెండు ట్రాక్టర్లు పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకం చేపట్టి, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

