కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు, కనీస మద్దతు ధర – ఎం ఎస్పీ(MSP)పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్లో సీసీఐ సీఎండీ, అధికారులతో పత్తి కొనుగోళ్ల సన్నాహక ఏర్పాట్లపై చర్చించారు. ఈ మీటింగ్ లో పత్తి ఎంఎస్పీ ధరకు కొనుగోళ్లపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు, రైతులకు ఎంఎస్పీ ప్రయోజనం అందేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశానికి సీసీఐ సీఎండీ, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ & ప్రభుత్వ కార్యదర్శి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్తో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : తెలంగాణలో ముగిసిన ‘సర్’.. లెక్కలు చూస్తే షాక్!
Follow Us On : WhatsApp

