బ్రేకింగ్.. శంకర్‌పల్లిలో ఘోర ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లి (Shankarpally)లో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఓ భారీ క్రేన్ ఊడి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డట్టు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకొని క్రేన్ శకలాలు తొలగిస్తోంది. భారీ వర్షం, ఈదురు గాలల కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>