జనగామలో పెద్దపులి కలకలం

కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలో పెద్దపులి సంచారం(Tiger movement) స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి లింగాల గణపురం మండలం మీదుగా రఘునాథపల్లి మండలం, మండేల గూడెం గ్రామంలో పరిశే రాజు వ్యవసాయ బావి వద్ద లేగ దూడను పులి చంపినట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులు  తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా బయట తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>