మహారాష్ట్ర గడ్చి రోలి జిల్లాలో ఎన్‌కౌంటర్

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర (Maharashtra) గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌ (Encounter)లో  ముగ్గురు మావోయిస్టులు (Three Maoists) మృతి చెందారు. ఈ మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఒక జవాన్ బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు.  ప్రస్తుతం ఆ జవాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్‌కౌంటర్ సమయంలో భద్రతా దళాలు మావోయిస్టుల వద్ద ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, ఇతర ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా, రెండు మావోయిస్టు శిబిరాలు ధ్వంసం చేయడం ద్వారా భద్రతా చర్యలను మరింత ప్రభావవంతం చేశారు. జిల్లా పోలీసులు, కేంద్ర సిబ్బంది కలిసి ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో మావోయిస్ట్ కార్యకలాపాలపై భద్రతా దళాలు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>