లొంగిపోయిన మావోయిస్టులకు బంపర్​ ఆఫర్​

కలం, వెబ్డెస్క్​ : తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టుల (Maoists) కు బంపర్ఆఫర్ ప్రకటించింది. లొంగిపోబాటు సమయంలో పునరావాస ప్రయోజనాల కింద అందించే పరిహారంతో పాటు అదనంగా నగదు అందించనుంది. తెలంగాణ పునరావ విధానానికి అనుగుణంగా.. డివిజనల్కమిటీ సభ్యులకు రూ. 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ.4 లక్షలు, ఒక్కో పార్టీ సభ్యుడి లక్ష రూపాయలను ప్రకటించారు.

వీటితో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం మావోయిస్టు లొంగుబాటు సమయంలో వాళ్లు అప్పగించే ఆయుధాలపై అదనపు రివార్డును ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. LMG (లైట్మెషిన్గన్​) అప్పగిస్తే.. రూ.5 లక్షలు, AK – 47 కు రూ.4 లక్షలు, INSAS రైఫిల్కు రూ.2 లక్షలు, SLR (సెల్ఫ్లోడింగ్రైఫిల్) కు రూ.2 లక్షలు, .303 రైఫిల్కు రూ. లక్ష, UGBL (అండర్బారెల్ గ్రైనెడ్ లాంచర్ )కు రూ.40 వేలు, 12 బోర్ లేదా సింగిల్సాట్ గన్సరెండర్చేస్తే రూ.30 వేలు నగదు ప్రోత్సాహం అందజేస్తారు.

కాగా, ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులకు (Maoists) పోలీసులు రూ. 1,46,30,000 అందించనున్నారు. తక్షణ సాయం కింద రూ.25 వేలు అందజేశారు. వీటితో పాటు అదనపు ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అందిస్తుంచనుంది.

Read Also: అమెరికా సంచలన కేసులో బిల్​గేట్స్​!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>