కలం, వెబ్ డెస్క్: కాసేపటిక్రితమే అసెంబ్లీ హాల్లో భేటీ అయిన మంత్రివర్గం.. తెలంగాణ బడ్జెట్ (Telangana Budget)కు ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశ బెట్టడానికి లైన్ క్లియర్ అయింది. మరికాసేపట్లో శాసనసభ, శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశబెట్టనున్నారు. ఇప్పటికే అసెంబ్లీకి అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు చేరుకున్నారు. బడ్జెట్ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్షాల వాడివేడి వ్యాఖ్యల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ నేతలు బడ్జెట్ ప్రవేశ బెట్టడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Also: మంజీరా నదిలో వేలాది చేపల మృత్యువాత
Follow Us On : WhatsApp

