కలం, వెబ్ డెస్క్ : యాసిడ్ దాడి బాధితుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యాసిడ్ దాడుల్లో బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా విధానాన్ని రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ అలా ఉద్యోగాలు ఇవ్వలేకపోతే వారికి జీవనాధారం కోసం ఆర్థిక భరోసార కల్పించేలా చెల్లింపులు చేయాలని సూచించింది. ఇలాంటి ఘటనల బాధితులకు పూర్తి స్థాయిలో ఆర్థిక భరోసా కల్పించినప్పుడే న్యాయం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.

