కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) తన కుటుంబంతో కలిసి ఓ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. మహేశ్ బాబు చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు (Adiseshagiri Rao) తనయుడు బాబీ ఘట్టమనేని (Bobby Ghattamaneni) కి ఇటీవల కవల పిల్లలు జన్మించారు. ఆ చిన్నారుల మొదటి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో మహేశ్ బాబు తన సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) తో కలిసి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కుటుంబ వేడుకలో మహేశ్ బాబు హాజరు కావడంతో ఆ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. చిన్నారుల పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్రోబ్లో ఈ మార్పులు చేసుకోండి
Follow Us On: Instagram

