కలం, స్పోర్ట్స్ : టీమిండియా దిగ్గజ స్పిన్నర్ (Ashwin) రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత, భారత టెస్టు జట్టులో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికైన విషయం కాదు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ ఆ స్థానంలో కనిపిస్తున్నా, స్థిరమైన ప్రదర్శన చేయడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో, త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న టెస్టు మ్యాచ్ కోసం ముగ్గురు దేశవాళీ స్పిన్నర్లు సెలెక్టర్ల దృష్టిలో ఉన్నారు.
ఆ ముగ్గురు వీళ్లే..
సారాంశ్ జైన్: మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్న ఈ 33 ఏళ్ల ఆల్రౌండర్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నారు. గత సీజన్లో 30 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్లోనూ 500పైగా పరుగులు చేసి జట్టుకు వెన్నెముకగా నిలిచారు.
పుల్కిత్ నారంగ్: సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుల్కిత్, తక్కువ మ్యాచ్ల్లోనే ఎక్కువ వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. బ్యాటింగ్లోనూ ఓపెనింగ్ చేయగల సామర్థ్యం ఇతని అదనపు బలం.
నిఖిల్ కశ్యప్: కేవలం 25 ఏళ్ల వయసున్న నిఖిల్, తన అరంగేట్రం సీజన్లోనే 26 వికెట్లతో సత్తా చాటారు. భవిష్యత్తు దృష్ట్యా యువకుడైన నిఖిల్కు అవకాశం ఇచ్చే ఆలోచనలో యాజమాన్యం ఉంది.
Read Also: విమర్శకుల నోళ్లు మూయించిన శ్రేయాస్ అయ్యర్!
Follow Us On: X(Twitter)

