epaper
Wednesday, February 18, 2026
epaper

భార్యను దారుణంగా హత్య చేసిన ఇస్రో మాజీ అధికారి

కలం, వెబ్​ డెస్క్​: ఊపిరాడకుండా టవల్​తో గొంతు బిగించి భార్యను దారుణంగా హత్య చేశాడు ఇస్రో మాజీ అధికారి ఒకరు (Retired ISRO Employee). ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) శివార్లలోని అవలహళ్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మెనహళ్లి ఏరియాలో ఇస్రో రిటైర్డ్​ ఉద్యోగి నాగేశ్వరరావు(65), సంధ్య శ్రీ దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో సంధ్య శ్రీని తన భర్త హత్య చేసినట్లు బుధవారం ఉదయం 11గంటల సమయంలో పోలీసులకు ఫోన్​లో సమాచారం అందింది. వాళ్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కొన్నేళ్లుగా నాగేశ్వర రావు (Retired ISRO Employee) డిప్రెషన్​తో బాధ పడుతున్నట్లు తేలింది. ఒత్తిడి, తీవ్ర ఆందోళన తట్టుకోలేక భార్యను హత్య చేసి అనంతరం తానూ చనిపోవడానికి సిద్ధమయ్యాడు. అయితే చివరి క్షణంలో మనసు మార్చుకొని సన్నిహితుల్లో ఒకరికి కాల్​ చేసి, హత్య విషయం చెప్పాడు. ఆ వ్యక్తి అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చి నిందితుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ దంపతుల కుమార్తె అమెరికాలో నివసిస్తోంది. ఆమెకు విషయాన్ని చేరవేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: తెలంగాణలోనే ఈవీల తయారీ: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>