కలం, వెబ్ డెస్క్: చిన్నస్వామి స్టేడియం బాక్సాఫీస్ హిట్ను తలపించేలా.. ఆర్సీబీ (RCB) బ్యాటర్లు స్టేడియంలో సిక్సర్ల సునామీ సృష్టించారు. విరాట్ కోహ్లీ (28) త్వరగానే అవుట్ అయినా, ఆ తర్వాత మొదలైంది అసలు విధ్వంసం. దేవదత్ పడిక్కల్ (50) తన క్లాస్ ఇన్నింగ్స్తో పునాది వేస్తే, కెప్టెన్ రజత్ పాటిదార్ (48), టిమ్ డేవిడ్ (70*) కలిసి సిక్సర్ల వేట మొదలుపెట్టారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 8 సిక్సర్లతో విరుచుకుపడి 280 స్ట్రైక్ రేట్తో సీఎస్కే బౌలర్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. అన్షుల్ కాంబోజ్, శివమ్ దూబే వంటి బౌలర్లు ఓవర్లకు 13-15 పరుగులు సమర్పించుకోవడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ ఇన్నింగ్స్లో అసలైన హైలైట్ ఏంటంటే.. ఆర్సీబీ రన్ రేట్ ఏకంగా 12.50 వద్ద నిలవడం! రజత్ పాటిదార్ 6 సిక్సర్లతో చెలరేగి తన పవర్ను చూపించగా, చివర్లో టిమ్ డేవిడ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈ టోర్నీలోనే ఆర్సీబీకి అత్యధిక స్కోరును అందించింది. కోహ్లీ వికెట్ పడ్డప్పుడు నిశ్శబ్దంగా ఉన్న గ్యాలరీలు, పాటిదార్-డేవిడ్ సిక్సర్ల వర్షానికి మారుమోగిపోయాయి. ఇప్పుడు సీఎస్కే (CSK) ముందు 251 పరుగుల ‘హిమాలయమంత’ లక్ష్యం ఉంది. ఇంతటి భారీ టార్గెట్ను ఛేదించాలంటే ధోనీ సేన అద్భుతం చేయాల్సిందే.

