రక్షణ శాఖ కీలక నిర్ణయం.. దేశీయ సంస్థలకే DRDO క్షిపణి టెక్నాలజీ

కలం, వెబ్​ డెస్క్​ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన అన్ని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు భారతీయ రక్షణ కంపెనీలకు బదిలీ చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆమోదం తెలిపారని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.

స్వదేశీ క్షిపణి తయారీని వేగవంతం చేయడం, దిగుమతులపై భారతదేశం యొక్క ఆధారపడటాన్ని తగ్గించడం, రక్షణ సరఫరాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో సహా దేశీయ కంపెనీల పాత్రను విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ ను ప్రోత్సహించడంతో పాటు భారతదేశ దేశీయ రక్షణ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>