కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణ సీరియల్లా సాగుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం సీరియస్గా తీసుకున్నట్లు అనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో.. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో సిట్ అవుతున్నారు తప్ప, ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణలో మాత్రం ఎలాంటి పురోగతీ కనిపించడం లేదని ఎంపీ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ సీరియస్గా తీసుకొని త్వరగా విచారణ పూర్తి చేసి, దోషులను జైలుకు పంపాలని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. సీపీ సజ్జనార్కు ఉన్న మంచి పేరు నిలబెట్టుకోవాలంటే, దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, నేరస్థులను కోర్టు ముందు నిలబెట్టాలని ఆయన సూచించారు. సిట్ 1, సిట్ 2 అంటూ మున్సిపల్ ఎన్నికల అనంతరం సిట్ 3 అని వాయిదా వేయకుండా కేసు త్వరగా తేల్చాలని ఎంపీ కోరారు.


