కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. ‘బండి ఎక్కి పారిపోయిన అమానుష బండిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు.. బేటి బచావ్ వదిలేసి, బేటా బచావ్ ఏంటి? నిలదీశారు. బండి సంజయ్ కొడుకును కాపాడటం కోసం రేవంత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితుడిని రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.
Read Also: ట్రాన్స్జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జీవో విడుదల
Follow Us On: Instagram

