Mobile Popup Ad
Mobile Popup Ad

రేపటి నుంచి వారం రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన

కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు ఫ్రాన్స్‌, స్లోవేకియాను సందర్శించనున్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ద్వైపాక్షిక సహకారం బలోపేతం చేయడం దిశగా పర్యటన ఉండనుంది. ఈ రెండు దేశాలతో భారత్ రక్షణ, పౌర అణు ఇంధనం రంగాలలో ద్వైపాక్షిక సహకారం దిశగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 సదస్సు అవుట్‌రీచ్ సెషన్స్‌ సదస్సుకు ప్రధాని హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో గ్లోబల్ దక్షిణ దేశాల ప్రాధాన్యతలను వివరించనున్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య 12 కొత్త ద్వైపాక్షిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే మోదీ, ట్రంప్‌ భేటీపై భారత్, అమెరికా దౌత్యవర్గాలు చర్చలు జరుపుతుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>