Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్​ స్ట్రాటజీ అదే.. వైసీపీ శ్రేణులకు పేర్ని కీలక సూచన

క‌లం, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల కులాలను టార్గెట్​ చేస్తూ రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్నాయి. గాదె సాయికృష్ణ మిస్సింగ్​ ఘటనతో మొదలైన ఈ పరంపర మరిన్ని నియోజకవర్గాలకు విస్తరించి తీవ్ర రూపం దాల్చుతోంది. అలాగే పవన్​ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఏపీలో కుల రాజకీయాలు రూపుమాపాలని, అప్పుడే ఏపీలో పరిస్థితులు మారుతాయని వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైసీపీ నేతలను రౌడీలుగా సంబోధిస్తూ స్ట్రాంగ్​ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై వైసీపీ ముఖ్య నేతలంతా పవన్​కు కౌంటర్​ ఇచ్చారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.

పవన్​ రాజకీయంగా పడిపోతున్నారని, జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా పవన్​ను పట్టించుకోవడం లేదని నాని అన్నారు. అందుకే పవన్​ సరికొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని చెప్పారు. ముందు జగన్​ను, వైసీపీ నేతలను నోటికొచ్చినట్లు తిట్టి రెచ్చగొడుతున్నాడని చెప్పారు. వైసీపీ శ్రేణులు ఆగ్రహంతో పవన్ పై ఎదురుదాడి చేస్తే జనసేన కార్యకర్తల వద్ద సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని అన్నారు. హామీలు, అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఇలా డైవర్షన్​ రాజకీయాలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు అందుకే ఇక నుంచి వైసీపీ శ్రేణులు పవన్​ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దని, ఆ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>