కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) కాంట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని 42 మంది కాంట్రాక్టర్లు సమావేశానికి హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డి. రాజామోహన్, ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ సర్దార్, కార్యదర్శిగా మహమ్మద్ ఆరిఫుద్దీన్, కోశాధికారిగా సీహెచ్. పెద్దిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని సభ్యులు తెలిపారు.

