నిర్మల్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా ‘ప్రజా పాలన’ దినోత్సవ వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరం పరిష్కరించేలా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ఏఓ ఎండీ యూనుస్ అలీ, సీఐలు కృష్ణ, సమ్మయ్య, మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, ఆర్‌ఐ అడ్మిన్ రామ్ నిరంజన్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, డీపీఓ, ఐటీ కోర్, భరోసా సిబ్బంది, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>