కలం, వెబ్ డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జరగబోయే నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఒక నోటీస్ను విడుదల చేసింది. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నీట్ (NEET) పరీక్ష రాయబోయే స్టూడెంట్స్ కోసం పరీక్ష సమయాన్ని 15 నిమిషాలకు పెంచింది. ఈ నిర్ణయంతో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించబడుతుంది.
సంతకాలు, ఇన్విజిలేషన్ వంటి ముందస్తు పరిపాలనా ప్రక్రియల వల్ల విద్యార్థులు తమకు కేటాయించిన రాసే సమయాన్ని నష్టపోకుండా ఉండేందుకే ఈ అదనపు సమయాన్ని ఇచ్చింది. అలాగే ప్రశ్నాపత్రం బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునే స్థలాన్ని రెండింతలకు పెంచింది. విద్యార్థులు లెక్కలు, ఇతర చిత్రాలు గీసుకోవడం కోసం నాలుగు పేజీలను కేటాయించింది.

