కలం, వెబ్డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్లో రెండు సార్లు ఛాంపియన్ ముంబై (Mumbai Indians Women) ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. సోమవారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. నాథన్ సీవియర్ బ్రంట్ అజేయ సెంచరీ (100 నాటౌట్; 57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్)కి తోడు, ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్(56; 39 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించారు. డబ్ల్యూపీఎల్లో నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు తీయగా, నదిన్ డి క్లెర్క్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో ఆర్సీబీ తడబడింది. 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన(15) మరోసారి తక్కువ స్కోరుకే అవుటైంది. రిచా ఘోష్ (90; 50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లు) చివరి వరకూ పోరాడినప్పటికీ మిగిలినవాళ్లు నిలవలేకపోయారు. దీంతో ఆ జట్టు చివరికి 184 పరుగులకు పరిమితమై పరాజయం పాలైంది. ముంబై బౌలర్లలో హీలీ మ్యాథ్యూస్ 3, షబ్నిమ్ ఇస్మాయిల్, అమెలియా కెర్ చెరో రెండు వికెట్లు తీశారు. అమన్జ్యోత్ కౌర్కు 1 వికెట్ దక్కింది. కాగా, ఏడు మ్యాచ్ల్లో 3 విజయాలతో ముంబై (Mumbai Indians Women) జట్టు సాంకేతికంగా ప్లేఆఫ్ రేసులో నిలిచింది.
Read Also: పరుగులు రాకపోయినా సంజూనే కొనసాగించాలి: రహానే
Follow Us On: Sharechat


