కలం, వెబ్ డెస్క్: బాలికల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలవుతున్నా.. అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ (Avanigadda) మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై 57 ఏళ్ల ఆర్ఎంపి డాక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తొమ్మిది నెలల గర్భంతో పాఠశాలకు రావడాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలిక ప్రసవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

