కలం, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని రైస్ మిల్లులను మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం అన్లోడింగ్లో జరుగుతున్న జాప్యంపై ఆయన మిల్లు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే అన్లోడ్ చేయకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాలు, తరుగు పేరిట రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రధానమని, మిల్లర్లు నిబంధనలను పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. తనిఖీలలో లోపాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు.
Read Also: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

