Mobile Popup Ad
Mobile Popup Ad

నాగర్ కర్నూల్‌లో రైస్ మిల్లులపై మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు

కలం, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని రైస్ మిల్లులను మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం అన్‌లోడింగ్‌లో జరుగుతున్న జాప్యంపై ఆయన మిల్లు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే అన్‌లోడ్ చేయకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాలు, తరుగు పేరిట రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రధానమని, మిల్లర్లు నిబంధనలను పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. తనిఖీలలో  లోపాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు.

Read Also: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>