కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project)ను సందర్శించిన నేపథ్యంలో, వారి పర్యటనను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రాజెక్టు పరిసరాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు ప్రాజెక్టు పైన ఎక్కడైతే నడిచారో, ఆ ప్రాంతాలను పాలతో కడిగి శుద్ధి చేశారు. ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టుపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ, దానికి నిరసనగానే తాము ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
BRS leaders purify Medigadda project with milk
బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్, సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు తిరిగిన ప్రాంతాన్ని పాలతో శుద్ధి చేశాడు. pic.twitter.com/8NXIjmX4PG— Kalam Daily (@kalamtelugu) April 23, 2026
Read Also: కాళేశ్వరం ఎఫెక్ట్ : రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్
Follow Us On: WhatsApp

