కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కురవి మండలంలో ఈదురు గాలులతో బారీ వర్షం కురిసింది. అకాల వర్షం తాకిడికి కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూధనపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం లో పిడుగు పడడంతో అక్కడ పని చేస్తున్న నీలం వెంకన్న (40) మృతి చెందాడు.

