కురవిలో భారీ వర్షం.. పిడుగు పాటుకు ఒకరి మృతి

కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కురవి మండలంలో ఈదురు గాలులతో బారీ వర్షం కురిసింది. అకాల వర్షం తాకిడికి కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూధనపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం లో పిడుగు పడడంతో అక్కడ పని చేస్తున్న నీలం వెంకన్న (40) మృతి చెందాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>