కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లాలో హత్య ఘటన కలకలం రేపింది. హసన్పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో బాల్నే మొగిలి అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. అతడి మరదలే ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో మొగిలిని గొడ్డలి, కత్తులతో దారుణంగా పొడిచి చంపినట్లు సమాచారం అందుతోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే హసన్పర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

