కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళీ దేవస్థానం (Warangal Bhadrakali) లో వసంత నవరాత్రి మహెూత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష మల్లె పూలతో అర్చన జరిపారు. అనంతరం అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని వరంగల్ ప్రముఖ న్యాయవాది భాస్కరవజ్ఞుల పురుషోత్తం-భవానీ దంపతులు నిర్వహించారు. సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
Read Also: మోదీని గద్దె దించడమే నా ప్రధాన లక్ష్యం : మమతా బెనర్జీ
Follow Us On: Facebook

