వసంత నవరాత్రి ఉత్సవాలు.. భద్రకాళీ అమ్మవారికి లక్ష మల్లె పూలతో అర్చన

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళీ దేవస్థానం (Warangal Bhadrakali) లో వసంత నవరాత్రి మహెూత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష మల్లె పూలతో అర్చన జరిపారు. అనంతరం అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని వరంగల్ ప్రముఖ న్యాయవాది భాస్కరవజ్ఞుల పురుషోత్తం-భవానీ దంపతులు నిర్వహించారు. సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>