వర్షాల కోసం వరుణుడికి చిన్నారుల వినూత్న వేడుకోలు

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి (Kukutlapally) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (Students) వర్షాభావ పరిస్థితులపై స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వరుణదేవుని కరుణ కోసం, రైతన్నల కష్టాలు తీరాలంటూ విద్యార్థులు చేపట్టిన వినూత్న పూజలు, ప్రార్థనలు, పాటల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంప్రదాయ పద్ధతిలో కప్పకు అభిషేకం, వర్షాలు పడక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలోని చెరువు నుంచి నీటిని తీసుకొచ్చి, సంప్రదాయ ఆచారాల ప్రకారం కప్పను వేపాకులతో అలంకరించి నీటితో ప్రత్యేక అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పొలాల్లో నిలబడి “చినుకమ్మ ఓ చినుకమ్మ… ఒక్కసారి వచ్చి నేల తడిపిపోవమ్మా” అంటూ ఆలపించిన పాట, చేసిన నృత్యం, వర్షాలు సమృద్ధిగా కురిసి, చెరువులు నిండి, రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు విరియాలి” అని కోరుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయత్నం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పిల్లల్లో వ్యవసాయం పట్ల అవగాహన, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులను, విద్యార్థులను పలువురు అభినందించారు.

Read Also: విచిత్ర ఘటన.. శివలింగంపై పోసిన నూనె పాలుగా మార్పు..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>