కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని బాచుపల్లిలో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు చేశారు. ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న తీరును వీడియో తీసి ఓ యువకుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. వీడియోలో ఎలాంటి భద్రతాపరమైన జాగ్రత్తలు లేకుండా పనులు చేస్తున్నారని పేర్కొన్నాడు. దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేపీ వివేకానంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ను ట్యాగ్ చేశాడు. ఈ వీడియోను కేటీఆర్ రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజల భద్రత గురించి పట్టించుకునే వారు ప్రభుత్వంలో ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

