కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (Kothagudem) పట్టణంలో పదో తరగతి విద్యార్థి నితీశ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ విద్యార్థి తల్లి మౌనిక నిరసనకు దిగింది. తన కుమారుడి మరణానికి శ్రీచైతన్య యాజమాన్యమే (School Management) కారణమని ఆరోపించింది. క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్ మానసికంగా వేధింపులకు గురిచేశారని తెలిపింది. ఈ ఘటన పై సమగ్రంగా దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఓ బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లనే నితీష్ ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడింది. తండ్రి లేకపోయినా తన కొడుకును చదివిస్తే, పాఠశాల యాజమాన్యం ప్రాణాలు తీసిందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

