కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త కమిటీల్లో చురుకైన కార్యకర్తలకే పోస్టులు ఇవ్వాలని ఆదేశించారు. నచ్చినవారికి ఇచ్చుకుంటే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని.. వారిని వెంటనే తొలగిస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో మీరు చేసే డ్రామాలు ఆపాలంటూ కొందరు నేతలను ఉద్దేశించి అన్నారు.

