కలం, వెబ్ డెస్క్ : వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya) ప్రజలకు ఒక ఆసక్తికరమైన చిట్కా చెప్పారు. ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరూ తమ జేబులో ఒక ఉల్లిపాయను ఉంచుకోవాలని ఆయన సూచించారు. తాను కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నానని చెబుతూ.. తన జేబులో ఉన్న ఉల్లిపాయను తీసి అందరికీ చూపించారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు తాను కారులో గానీ ఇతర ప్రదేశాల్లో గానీ ఎయిర్ కండిషనర్ వినియోగించడం లేదని ఆయన తెలిపారు. మన పూర్వీకులు అనుసరించిన ఇటువంటి సహజ సిద్ధమైన పద్ధతులు వడదెబ్బ నుంచి కాపాడతాయని ఆయన పేర్కొన్నారు.

