కలం, వెబ్ డెస్క్: ఇరాన్ అన్నంత పనీ చేసింది. శ్రీలంక తీరంలో తమ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా ముంచేయడంపై ప్రతీకారం తీర్చుకుంది. గురువారం పర్షియన్ గల్ఫ్లో యూఎస్ ఆయిల్ ట్యాంకర్పై (US Oil Tanker) దాడి చేసింది. ఈ మేరకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. అయితే, ఈ దాడిని అమెరికా ధ్రువీకరించలేదు.
కాగా, విశాఖపట్నంలో జరిగిన నేవీ ఫ్లీట్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వెళుతున్న ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను (IRIS Dena) బుధవారం అమెరికా ముంచేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకలోని గాలె పట్టణానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో, హిందూ మహాసముద్రంలో వెళుతున్న వార్షిప్పై టోర్పడోతో దాడి చేసింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 180 మందిలో 87 మంది చనిపోగా, 78 మందిని శ్రీలంక నావికాదళం రక్షించింది. మిగిలివాళ్లు గల్లంతయ్యారు.
ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ నౌకను ముంచేసినందుకు అమెరికా చింతించేలా చేస్తామని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఆ క్రమంలోనే హర్మూజ్ జలసంధి వద్ద వెళుతున్న యూఎస్ ఆయిల్ ట్యాంకర్పై (US Oil Tanker) దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడిలో ఎంతమంది మరణించింది తెలియరాలేదు.
Read Also: మన అతిథిని చంపితే మౌనమా?.. ప్రధానిపై రాహుల్ విమర్శ
Follow Us On: Instagram

