కలం, వెబ్ డెస్క్: అస్సాంలోని జోర్హాట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్ 32 ట్రాన్స్పోర్ట్ విమానం కుప్పకూలింది. జోర్హాట్ ఎయిర్ బేస్ లో IAF AN-32 ఎయిర్క్రాఫ్ట్ విమానం ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా కిందపడగానే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పెద్దఎత్తున మంటలు, పొగలు చెలరేగడంతో విమానం ధ్వంసమైంది. ఈ విమానం భారత వాయుసేనలో 40 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జోర్హాట్ విమాన ప్రమాదంపై ఐఏఎఫ్ (IAF) ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తునకు ఆదేశిచింది.

