కలం, స్పోర్ట్స్ : శ్రీలంకతో గల్లే వేదికగా జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు ముందే భారత్కు కీలక హెచ్చరిక ఎదురైంది. రవిచంద్రన్ అశ్విన్ లేకపోవడం పెద్ద లోటని శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ ఫర్వీజ్ మహరూఫ్ (Farveez Maharoof ) అన్నారు. అశ్విన్కు శ్రీలంకలో మంచి రికార్డు ఉందని ఆయన గుర్తు చేశారు. గల్లే పిచ్పై స్పిన్నర్లకు టర్న్ కంటే బౌన్స్ కీలకమని చెప్పారు. వాషింగ్టన్ సుందర్ లేకపోవడం కూడా భారత్కు లోటేనని మహరూఫ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి పిచ్పై బౌన్స్ రాబట్టగల సామర్థ్యం అతడికి ఉందని చెప్పారు.
అశ్విన్ 2024లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా కెరీర్ చివరి దశకు చేరుకున్నారు. కుల్దీప్ యాదవ్ 79 టెస్టు వికెట్లు తీసినా, 2017లో అరంగేట్రం తర్వాత కేవలం 18 టెస్టులే ఆడారు. భారత్కు మూడు స్పిన్నర్ల కాంబినేషన్ సరిపోతుందని మహరూఫ్ సూచించారు. జడేజా, కుల్దీప్తో పాటు మానవ్ సుతార్ను ఆడించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అఫ్గానిస్థాన్పై అరంగేట్ర టెస్టులో సుతార్ ఏడు వికెట్లు తీశాడు. కొలంబోలో జరిగిన వార్మప్ మ్యాచ్లోనూ అతడు ఆకట్టుకున్నాడు.
గల్లే పిచ్పై బౌన్స్ రాబట్టే అతడి సామర్థ్యం ఉపయోగపడుతుందని మహరూఫ్ అన్నారు. సారంశ్ జైన్ కూడా జట్టులో ఉన్నా, అనుభవజ్ఞులైన శ్రీలంక బ్యాటర్లపై అరంగేట్రం చేయడం అతడికి సవాలేనని చెప్పారు. గల్లేలో గాలి పరిస్థితులను భారత స్పిన్నర్లు త్వరగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని మహరూఫ్ పేర్కొన్నారు. గాలి కారణంగా బంతికి డ్రిఫ్ట్ లభించే అవకాశం ఉందని చెప్పారు. శ్రీలంక స్పిన్ విభాగంలో ప్రభాత్ జయసూర్య కీలక ఆయుధమని మహరూఫ్ అన్నారు.
గల్లేలో అతడి రికార్డు బలంగా ఉందని పేర్కొన్నారు. భారత్ బ్యాటింగ్లో రిషభ్ పంత్ అత్యంత ప్రమాదకర ఆటగాడని మహరూఫ్ అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలోనే మ్యాచ్ దిశను మార్చగల సత్తా అతడికి ఉందని చెప్పారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా సహజమైన దూకుడు ఆటను కొనసాగించాలని సూచించారు. తొలి 10-15 బంతులను జాగ్రత్తగా ఎదుర్కొని తర్వాత స్వేచ్ఛగా ఆడాలని చెప్పారు. ఈ సిరీస్లో తొలి ఇన్నింగ్స్ స్కోర్లు చాలా కీలకంగా మారుతాయని మహరూఫ్ అంచనా వేశారు. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించడం ఇరు జట్లకు ముఖ్యమని పేర్కొన్నారు.

