కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 (Banjara Hills Road No 10) జహీరానగర్ లో 2 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా జరుగుతోన్న నిర్మాణాలను షేక్ పేట్ రెవెన్యూ సిబ్బంది అడ్డుకుంది. ఈ మేరకు షేక్ పేట్ తహసీల్దార్ అనితారెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కాంప్లెక్ నిర్మాణం కోసం 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో గత రాత్రి అక్రమంగా నిర్మాణాలు చేసేందుకు యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు యువకులకు అదుపులోకి తీసుకుకొని విచారిస్తున్నారు.
Read Also: పాత పెళ్లి పత్రికలతో పిచ్చుకలకు కొత్త గూడు
Follow Us On: Sharechat

