కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా పున్నేలులో భార్యతో పాటు ఇద్దరు పిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కిరాతకానికి ఒడిగట్టిన మృతురాలి భర్తతో పాటు, అతడికి సహకరించిన మరో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడు వేరే మహిళతో ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో, అడ్డుగా ఉన్న భార్యాపిల్లలను వదిలించుకోవాలని పథకం వేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారిని స్విమ్మింగ్ పూల్లో వేసి హత్య చేసినట్లు విచారణలో తేలిందని సీపీ చెప్పారు.
Read Also: ఓరుగల్లు రాణి రుద్రమలు: కార్పొరేషన్ నుంచి క్యాబినెట్ వరకు మహిళలదే హవా!
Follow Us On: X(Twitter)

