మంచిర్యాల‌లో భారీగా అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టివేత‌

క‌లం, వెబ్ డెస్క్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ మంచిర్యాల(Mancherial) జిల్లా క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీలో భారీగా అక్ర‌మ మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. ఎన్నిక‌ల కోసం పంచేందుకు ప‌దో వార్డులోని చంద్ర‌య్య ఇంట్లో నిల్వ చేసిన మ‌ద్యాన్ని రామ‌కృష్ణాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స‌ద‌రు మ‌ద్యం విలువ సుమారు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. ఇది స్థానికంగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న స్వ‌తంత్ర‌ అభ్య‌ర్థి గొల్ల‌ప‌ల్లి మ‌హేంద‌ర్‌కు చెందిన‌దిగా గుర్తించారు. అక్ర‌మంగా మ‌ద్యం నిలువ చేయ‌డంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>