కలం, వెబ్ డెస్క్ : నైజీరియా (Nigeria) లో ఘోరమైన ఉగ్రవాద దాడులు జరిగాయి. క్వారా (Kwara) రాష్ట్రంలోని వోరో, నూకు గ్రామాలపై ఇస్లామిక్ ఉగ్రవాదులు (Islamic militants) దాడులు జరిపి 162 మందిని హత్య చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. పెద్ద సంఖ్యలో మృతదేహాలు వీధుల్లో పడిపోయి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయానికి లోనయ్యారు. ప్రభుత్వం, భద్రతా సిబ్బందిని క్షణక్షణం పెంపొందిస్తూ గ్రామాల్లో భద్రతా చర్యలను తీసుకుంటుంది. అంతర్జాతీయంగా ఈ దాడిని ఘోర ఉగ్రవాద చర్యగా ఖండించారు.


