కలం, వెబ్ డెస్క్: ఉప్పల్ (Uppal) స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ (SRH) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే జనం ఒక్కసారిగా రోడ్ల మీదికి రావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. స్టేడియం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలతో బస్సులు, మెట్రో రైళ్లు జనంతో కిక్కిరిసి పోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో నాగోల్ నుంచి హబ్సిగూడ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.

