లక్నోతో మ్యాచ్‌: పాండ్యా ఎందుకు ఆడలేదో తెలుసా?

కలం, స్పోర్ట్స్: లక్నో సూపర్ జెయింట్స్‌తో (LSG) సోమవారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక పెద్ద షాక్ తగిలింది. టాస్ వేయడానికి కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు  (Hardik Pandya) బదులుగా సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. హార్దిక్ ఈ మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యాడనే విషయంపై ముంబై ఆటగాడు రియాన్ రికెల్టన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

సోమవారం మధ్యాహ్నం వరకు కూడా కెప్టెన్ హార్దిక్ ఆడటం లేదనే విషయం జట్టు సభ్యులకు కూడా తెలియదు. హార్దిక్ వెన్నునొప్పితో (Back Spasms) బాధపడుతున్నారని, అందుకే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రికెల్టన్ మాట్లాడుతూ.. హార్దిక్ గాయం ఎంత తీవ్రంగా ఉందో తనకు తెలియదని, కానీ ఈ వారం రాయ్‌పూర్‌లో జరిగే తదుపరి మ్యాచ్ కల్లా ఆయన జట్టుతో చేరుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కోర్బిన్ బాష్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మిగిలిన జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>