కలం, కరీంనగర్: జాతీయ రైతు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుజ్జుల రవీందర్ రెడ్డి (Gujjula Ravinder Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. గతంలో నుస్తులాపూర్ సింగల్ విండో ఛైర్మన్, కరీంనగర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్గా ఆయన పని చేశారు. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రెడ్డి కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమస్యలపై పోరాడుతానని తెలిపారు.

