కలం, వెబ్ డెస్క్: ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, గాడి తప్పిన ఆర్థిక విధానాన్ని దారిలో పెడుతున్నాం సాధ్యమైనది త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం ఉదయం శాసన పరిషత్తులో సభ్యులు ఏవీఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవసరాల కోసం తీసుకున్న ఈ EMIలకు ప్రతినెలా మొదటి తేదీన చెల్లించకపోతే బ్యాంకులు వారి ఖాతాలు డిఫాల్ట్ జాబితాలో చేరుస్తాయి. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 18 వ తారీఖున కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా ప్రభుత్వం వచ్చాక ఆలోచన చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాము. ఉద్యోగులు మాలో భాగస్వాములుగా భావించి మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినెలా ఒకటవ తేదీన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నాం అన్నారు.
ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు ఉద్యోగుల ప్రయోజనాలు చెల్లించకుండా రిటైర్మెంట్ వయోపరిమితిని మూడు సంవత్సరాలకు గత ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాటి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచకపోయి ఉంటే వాస్తవంగా 2021 నుంచి 2023 మధ్య సంవత్సరాల్లో 26,854 మంది పదవి విరమణ పొందాలి కానీ ఓయోపరిమితి పెంపుతో కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారని ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఆనాడు వాస్తవాలు తెలియక కొంతమంది పాలాభిషేకాలు చేశారని అన్నారు.
2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం మాకు వివిధ రకాల బకాయిల కింద 43,154 కోట్లు బిల్స్ పెండింగ్ లో పెట్టి వెళ్లిపోయిందని తెలిపారు. ఇందులో కేవలం ఉద్యోగుల బకాయిలే 4,575 కోట్లు ఉన్నాయి ఈ విషయాన్ని ఆర్థిక శ్వేత పత్రంలో సైతం వివరించామని డిప్యూటీ సీఎం తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ బెనిఫిట్స్ 1,752 కోట్ల రూపాయలు చెల్లించాము ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 6,244 కోట్లు ఉన్నాయి ప్రాధాన్యత క్రమంలో ప్రతినెల ఇబ్బంది లేకుండా చెల్లిస్తూ వెళ్తున్నామని తెలిపారు. ప్రతినెల అదనంగా ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసేందుకు 700 కోట్లకు తక్కువ కాకుండా విడుదల చేస్తున్నామని వివరించారు.
గత ప్రభుత్వం కనీసం ఒకటవ తేదీన జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు సకాలంలో చెల్లింపులు చేయలేక విష వలయంలో చిక్కుకొనిపోయారని మేము రాగానే వారితో మాట్లాడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని విధానపరమైన నిర్ణయం తీసుకొని ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా చెల్లిస్తున్నాం, మెడికల్ బిల్లులు పెండింగ్ లో పెట్టడం అమానవీయ అంశంగా మా ప్రభుత్వం భావించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 200 కోట్ల పైన మెడికల్ బిల్లులు మొత్తాన్ని క్లియర్ చేశాం, ఇకనుంచి ఏ నెలకు ఆ నెల మెడికల్ బిల్లులు క్లియర్ చేస్తామని తెలిపారు. ఇక సప్లిమెంటరీ శాలరీ ల విషయానికొస్తే 560 కోట్లు బకాయిలు మొత్తం క్లియర్ చేశాం ఇకనుంచి సప్లమెంటరీ శాలరీ బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని డివిడి సీఎం తెలిపారు.
ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన హెల్త్ స్కీమును వారే డిజైన్ చేసుకొని రావాలని చెప్పాం, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి నెలా టెన్షన్ గా మొదటి తేదీన జీతాలు చెల్లించడం కూడా గొప్ప విషయమే అని డిప్యూటీ సీఎం తెలిపారు. మొదటి తేదీనా జీతాలు (Salaries) ఇవ్వకపోతే ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీల కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు.


