కలం, వెబ్ డెస్క్: పుత్తడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. శ్రావణ మాసం వేళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. శనివారం నాటి మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,520 పెరిగి, రూ. 1,63,090 కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,400 పెరిగి రూ. 1,49,500కు చేరింది. మరోవైపు హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 2.70 లక్షలుగా ఉంది.

